ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ గ్రామసభ
ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ గ్రామసభ చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో రీ సర్వే గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, మండల సర్వేయర్ ప్రేమ్ కుమార్, ఆర్ఐ శ్రీనివాస రావు, వీఆర్వో ఆనంద రావు పాల్గొన్నారు. ఇజ్జిగాని వెంకటేశ్వరావు మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రెవిన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది రీ సర్వే పూర్తయిన తరువాత, రైతులకు రాజముద్రతో పాసుపుస్తకాలు పంపిణీ చేయబడతాయి," అన్నారు. ఈ కార్యక్రమంలో పుచ్చకాయల సత్యనారాయణ రెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు.