BREAKING
ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు.....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 09:59 PM
78 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు.. సెప్టెంబర్‌ నుంచి ఎన్నికల సందడి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 7న మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ విడుదల కాగా, సెప్టెంబర్‌ 20న పోలింగ్, సెప్టెంబర్‌ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సెప్టెంబర్‌ 28న నోటిఫికేషన్ విడుదల చేసి, అక్టోబర్‌ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 14న ఫలితాలు ప్రకటించనున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్‌ 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్‌ 28న పోలింగ్‌తో పాటు ఫలితాలు వెల్లడించనున్నారు. నవంబర్‌ 1 నుంచి కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి.

స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యం కీలకం.. ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు

ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి తోడ్పడాలని అధికారులు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాలు, పట్టణాల భవిష్యత్‌ అభివృద్ధికి కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.