ఆన్లైన్లో ఔషధాల డెలివరీని వ్యతిరేకిస్తూ నేడు మెడికల్ షాప్ల బంద్ నిర్వహణ..
ఆన్లైన్లో ఔషధాల డెలివరీని వ్యతిరేకిస్తూ నేడు మెడికల్ షాప్ల బంద్ నిర్వహణ..
అన్నమయ్య జిల్లా..
పుంగనూరు లో మెడికల్ షాప్ల బంద్...
ఒకరోజు బంద్కు పిలుపునిచ్చిన ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్..
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD)ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి.మెడికల్ షాప్ నిర్వాహకుల ఆధ్వర్యంలో రోడ్డు పై పెద్ద ఎత్తున ర్యాలీ గా నిరసన చేపట్టారు.అనంతరం తహసీల్దార్ రాము డి టి నాగేశ్వర్ లకి ఆన్లైన్లో ఔషధాల డెలివరీ ని అరికట్టడానికి కల్తీ మందులతో ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడుతున్న ప్రవేటు ఆన్ లైన్ మెడికల్ సంస్థల పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా పుంగనూరు మెడికల్ షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆన్లైన్ మందుల అమ్మకాలు, కార్పొరేట్ ఇ-ఫార్మసీ కంపెనీల పెరుగుతున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా నిరసనను నిర్వహిస్తున్నామని, ఆన్లైన్లో మందుల అమ్మకాలతో ప్రజలకు, మెడికల్ దుకాణాల నిర్వా హకులకు నష్టమే వాటిల్లుతుంది. ప్రభుత్వ విధానాలపై తాము చేస్తున్న పోరాటం అందరి మంచి కోసమే. ఆన్లైన్లో మందులు కొనుగోళ్లతో నాసిరకమైన మందులు వచ్చే అవకాశం ఉంది.సరి ఐనా లైసెన్సు లు లేక పోయిన ఆన్ లైన్ మందులు విక్రయించడం చాలా ప్రమాదకరం. ఇది ప్రజల ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్నారు.రిటైల్ విక్రయాలు తగ్గి స్థానికంగా ఉండే చిన్న చిన్న మెడికల్ షాపుల నిర్వాహకులకు భారంగా మారుతుందన్న విషయం పై నేడు నిర్వ హిస్తున్న మెడికల్ షాప్ల బందుకు ప్రజలు సహక రించాలని కోరుతున్నామని అన్నారు.