ఆపదలో అండగా ప్రభుత్వం
ఆపదలో అండగా ప్రభుత్వం – వంగల గోపాలస్వామికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో మానవతా దృక్పథానికి ప్రతీకగా మరో సహాయం అందింది. చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామానికి చెందిన వంగల గోపాలస్వామికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.48 వేల చెక్కును రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జనార్ధనవరం టిడిపి నాయకులు కలకొండ భాస్కర్ రావు, మాజీ సర్పంచ్ పలగాని దుర్గారావు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు వంగల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ సహాయం అందుకోవడంతో బాధితుడు వంగల గోపాలస్వామి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి కొలుసు పార్థసారథికి మరియు టిడిపి నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.