www.ntodaynews.com
ఆర్టీసీ జేఏసీతో అధికారుల చర్చలు విఫలం
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | NTODAY NEWS
విజయవాడలో ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ప్రైవేట్ విద్యుత్ బస్సుల ప్రవేశం అంశంపై ఇరు వర్గాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగినట్లు సమాచారం.
ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరారు.