BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

ఆర్థిక భద్రతతోనే మహిళల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
02 Jun, 2026 - 04:29 PM
16 వీక్షణలు

ఆర్థిక భద్రతతోనే మహిళల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి

• సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతేనే వేగవంతమైన అభివృద్ధి 

• సామాజిక సేవా సంస్థలు, సంపన్నులు ప్రభుత్వ ఆశయంలో భాగం కావాలి.

• పేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ప్రత్తిపాటి.

రెక్కల కష్ఠం, శక్తియుక్తులతో జీవించే పేద, మధ్య తరగతి మహిళల జీవితాలు మెరుగుపడి, ఆర్థిక భద్రత లభిస్తేనే, సమాజానికి మేలు జరుగుతుందని, ఆ దిశగా స్వచ్చంద సంస్థలతో పాటు.. కార్పొరేట్ సంస్థలు తమ సహాయ సహకారాలు అందించాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. 

మంగళవారం ఆయన పట్టణ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో జి.డి.యం.సి. చైర్మన్ వడ్డ్రణం హరిబాబు తో కలిసి పాల్గొని, 20 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రోటరీ క్లబ్ నిర్వాహకుల సేవల్ని కొనియాడారు. 

రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలో సామాజిక, సేవా సంస్థలు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. ప్రజా సేవకు రాజకీయాలతో పనిలేదని, మంచి చేయాలనే ఆశయం, ఆలోచన ఉంటే సరిపోతుందన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలంతో పాటు.. సంపన్నులు, సామాజికంగా,  ఆర్థికంగా బలంగా ఉన్నవారి ఆలోచనా విధానం మారాలని, అప్పుడే పేదరికమనే జబ్బు మాయమవుతుందన్నారు.  ప్రభుత్వ ఆశయానికి ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, ప్రజల సహాకారం తోడైతేనే పీ-4 విజయవంతంగా అమలవుతుందని ప్రత్తిపాటి చెప్పారు.  

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందిమల్ల జయమ్మ, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, రోటరీ క్లబ్ సభ్యులు ఉప్పుటూరి ప్రసాద్, బోడే రామసుబ్బారావు, చిలుకూరి శ్రీనివాసరావు, కాంతయ్య, అడుసుమల్లి మోహన్ రావు, సాంబశివరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కూటమి నాయకులు, తదితరులు  పాల్గొన్నారు.