BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఆస్తుల కోసం కన్నతండ్రినే బయటకు పంపించిన కుటుంబం..!

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 10:17 PM
176 వీక్షణలు

ఆస్తుల కోసం కన్నతండ్రినే బయటకు పంపించిన కుటుంబం..!

వృద్ధుడి దయనీయ స్థితి చూసి స్పందించిన స్థానికులు

చాకచక్యంగా స్పందించిన మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్

మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పశువుల ఆస్పత్రి సమీపంలో అవ్వారు నాగేశ్వరరావు అనే వృద్ధుడు నిరాశ్రయ స్థితిలో ఒంటరిగా కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆకలితో, ఆవేదనతో అక్కడే కూర్చున్న వృద్ధుడిని గమనించిన సచివాలయ పోలీసు సిబ్బంది, నవులూరు టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నజీర్ వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆస్తులన్నీ తమ పేర్లకు రాయించుకుని అనంతరం ఇంటి నుంచి బయటకు పంపించినట్లు నాగేశ్వరరావు తెలిపినట్టు సమాచారం.

ఈ విషయంపై స్పందించిన ఎస్సై వెంకట్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వృద్ధులను చూసుకోవడం కుటుంబ సభ్యుల బాధ్యత అని, ఆస్తుల కోసం వారిని వేధించడం అమానుషమని హెచ్చరించారు. అనంతరం నాగేశ్వరరావును సురక్షితంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.

ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ మాట్లాడుతూ…

“వృద్ధులను నిర్లక్ష్యం చేయడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కుటుంబ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలి” అని సూచించారు.