BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఏలూరు జిల్లాలో సహకార బ్యాంకులో రూ.1.44 కోట్ల గోల్మాల్..? మక్కినవారిగూడెం సొసైటీలో కలకలం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 08:19 AM
124 వీక్షణలు

 చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, టి.నర్సాపురం మండలం: టి.నర్సాపురం మండలంలోని మక్కినవారిగూడెం సహాయ సహకార బ్యాంకులో సుమారు రూ.1.44 కోట్ల నిధులు గోల్మాల్ అయినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

ఈ వ్యవహారంపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు సొసైటీ అధ్యక్షుడు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అభ్యంతరం వ్యక్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఘటనపై యుద్ధ ప్రాతిపదికన సమగ్ర విచారణ చేపడితే నిధుల గోల్మాల్ అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, సొసైటీలో గతంలో కార్యదర్శి విధులు నిర్వహించిన వ్యక్తి స్థానంలో అనుభవం లేని వ్యక్తిని విధుల్లోకి తీసుకుని, చివరి దశలో అదే వ్యక్తిపై ఆరోపణలు మోపడం వెనుక అసలు కారణాలేంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, గతంలో చింతలపూడి మండలం పోతునూరు సహకార సొసైటీలో కార్యదర్శి ఆత్మహత్య ఘటన మరువకముందే, ఇప్పుడు మక్కినవారిగూడెం సొసైటీ వ్యవహారం మరోసారి సహకార శాఖ పనితీరుపై చర్చకు దారి తీసింది.

అయితే, రూ.1.44 కోట్ల గోల్మాల్‌కు సంబంధించి అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విచారణ అనంతరం పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.