www.ntodaynews.com
కడప జిల్లాలో విషాదం.. విద్యుత్ స్తంభం విరిగి వృద్ధ దంపతుల దుర్మరణం
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆకుల వీధిలో నివసిస్తున్న పందిటి నడిపి సుబ్బరాయుడు (85), ఓబులమ్మ (75) దంపతులు విద్యుత్ స్తంభం విరిగి తమపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల వివరాల ప్రకారం, వరి పొట్టు లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ తీగలను తగలడంతో విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి పడింది. ఆ సమయంలో తమ ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై స్తంభం పడటంతో వారు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో మైదుకూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ, డ్రైవర్పై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.