BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

తిరుమల బ్రహ్మోత్సవాలకు సిద్ధం.. 50 ఎలక్ట్రిక్ బస్సులతో భక్తులకు మెరుగైన సేవలు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 09:34 AM
78 వీక్షణలు

తిరుమలలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందిస్తున్న 25 ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల నియామకం తదితర అంశాలపై తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో రిలయన్స్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం టీటీడీ వద్ద ఉన్న 15 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మరో 10 బస్సులను కలుపుకుని మొత్తం 50 బస్సుల సామర్థ్యానికి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకేసారి 20 బస్సులు ఛార్జింగ్ అయ్యేలా 10 ఛార్జింగ్ పాయింట్లు, 2 మెగావాట్ల సామర్థ్యంతో ఫాస్ట్ ఛార్జింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రతి బస్సులో 50 మంది భక్తులు సురక్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు, బస్సుల్లో ఆధునిక ప్రయాణికుల సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి తదుపరి బస్టాప్ వివరాలు డిజిటల్ రూపంలో కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే 50 మంది నిపుణులైన డ్రైవర్లను సిద్ధం చేసి, ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా రెండు షిఫ్టుల్లో 50 బస్సులను నడిపే కార్యాచరణ రూపొందించాలని సూచించారు. బస్సుల పార్కింగ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బ్రహ్మోత్సవాలకు ముందే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.