ఆశా వర్కర్ల మే నెల జీతం వెంటనే చెల్లించాలి
జూన్ 14 వరకు ప్రజాప్రతినిధులకు వినతులు: ఆశా యూనియన్ పిలుపు
సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్
ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) సమావేశం గురువారం రోజున మంచిర్యాల పట్టణంలోని చార్వక హాల్ నందు కామ్రేడ్ సమ్మక్క అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ...రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.గత నెల వేతనం కూడా నేటికీ ప్రభుత్వం చెల్లించలేదన్నారు. సకాలంలో వేతనం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నమన్నారు. సమ్మక్క, సరోజ ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆశాల పట్ల అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, ఫిక్స్ డ్ వేతనం సాధనకై జూన్ 14వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలల్లో, పట్టణాల్లో ప్రజాప్రతినిధులకు వినతుల ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంను జిల్లాలోని ఆశాలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శోభ ఆశా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, లీలారాణి విజయలక్ష్మి , లక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు శైలజ హెలన్, తదితరులు పాల్గొన్నారు.