నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల పంపిణీ
సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న బిఆర్ఎస్ ముఖ్య నాయకులు
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ షేక్ అంకుష్ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజానేత నడిపెల్లి విజిత్ కుమార్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ సేవా కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల పట్టణ పూర్వ అధ్యక్షులు గాదె సత్యం, హాజీపూర్ మండలం పూర్వ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ లతో పాటు ముఖ్య నాయకులు పడాల రవీందర్, షారుక్, రామగిరి శ్రీకాంత్, సల్మాన్, ఎండీ. షకీల్, ఎండీ. దానీష్ తదితరులు పాల్గొన్నారు