విజిత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదినం సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ పరిధిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల బీఆర్ఎస్వై మాజీ ప్రధాన కార్యదర్శి పడాల రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆనంద నిలయంలో ఉన్న వారికి మధ్యాహ్న భోజనం అందజేసి, నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడాల శ్రీనివాస్, బల్లికొండ రమేష్, రాజన్న, జాడి కళా, జావిద్, షారుక్, నక్క తిరుపతి, రామగిరి శ్రీకాంత్, శ్రీకాంత్, షకీల్, సల్మాన్, కిరణ్, అక్బర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.