BREAKING
ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ
www.ntodaynews.com

తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
11 Jun, 2026 - 01:49 PM
7 వీక్షణలు

తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని మనోజ్ నగర్ ప్రాంతం ప్రస్తుతం అక్రమ కట్టడాలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, సరైన అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

నివాస ప్రాంతాల మధ్యలో వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస సెట్‌బ్యాక్‌లు పాటించకపోవడం, రహదారుల వెడల్పును పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ నిర్మాణాల వెనుక స్థానిక ప్రభావశీలులు, రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడం వెనుక కారణాలపై ప్రజల్లో చర్చ సాగుతోంది. విచారణ చేపడితే అసలు సూత్రధారులు బయటపడతారని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, తాడిగడపలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లేందుకు బాధితులు, సామాజిక కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. :::