BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
11 Jun, 2026 - 01:49 PM
87 వీక్షణలు

తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని మనోజ్ నగర్ ప్రాంతం ప్రస్తుతం అక్రమ కట్టడాలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, సరైన అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

నివాస ప్రాంతాల మధ్యలో వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస సెట్‌బ్యాక్‌లు పాటించకపోవడం, రహదారుల వెడల్పును పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ నిర్మాణాల వెనుక స్థానిక ప్రభావశీలులు, రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడం వెనుక కారణాలపై ప్రజల్లో చర్చ సాగుతోంది. విచారణ చేపడితే అసలు సూత్రధారులు బయటపడతారని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, తాడిగడపలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లేందుకు బాధితులు, సామాజిక కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. :::