www.ntodaynews.com
యూరియా, డి.ఎ.పి అమ్మకాలు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా తప్పనిసరి విస్సన్నపేట ఏవో జి రాజ్యలక్ష్మి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విసన్నపేట: విసన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని ఎరువుల షాపుల్లో ఈరోజు మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి తనిఖీ నిర్వహించారు.
తనిఖీ సందర్భంగా యూరియా మరియు డి.ఎ.పి నిల్వలు, షాపుల రిజిస్టర్లు పరిశీలించి, ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా ఏపీ ఎయిమ్స్ (AP AIMS) యాప్ ద్వారా జరగాలని పేర్కొన్నారు. యాప్లో రికార్డ్ చేయకుండా అమ్మకాలు చేసిన ఎరువుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
అంతేకాక, అందరు రైతులు కూడా ఏపీ ఎయిమ్స్ యాప్లో రిజిస్టర్ కావాలని జీ. రాజ్యలక్ష్మి సూచించారు, తద్వారా ఎరువుల సరఫరా మరింత పారదర్శకంగా, సకాలంలో ఉండేలా చూస్తామని చెప్పారు.