శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్తో యువకుడు మృతి
చిత్తూరు జిల్లా శంఖంపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ (24) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.
వివరాల ప్రకారం, మృతుడి బంధువైన కాశీ నంద చౌదరికి చెందిన మామిడి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు శ్రావణ్ కుమార్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో తోట పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో అడవి జంతువులను పట్టుకునేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల ఉచ్చులో చిక్కుకున్నాడు.
విద్యుత్ తీగలు తగిలి తీవ్ర షాక్కు గురైన శ్రావణ్ కుమార్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై మృతుడి తమ్ముడు తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాకాల సీఐ చిన్న గోవిందు దర్యాప్తు ప్రారంభించారు. అడవి జంతువుల కోసం విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.