BREAKING
శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం విద్యార్థుల భవితవ్యానికి ఉపాధ్యాయులే పునాదులు దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి అమావాస్య ప్రత్యేక పూజలు మారెమ్మ తల్లికి మాదిగల జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం విద్యార్థుల భవితవ్యానికి ఉపాధ్యాయులే పునాదులు దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి అమావాస్య ప్రత్యేక పూజలు మారెమ్మ తల్లికి మాదిగల జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం
www.ntodaynews.com

శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 07:49 PM
9 వీక్షణలు

చిత్తూరు జిల్లా శంఖంపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ (24) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.

వివరాల ప్రకారం, మృతుడి బంధువైన కాశీ నంద చౌదరికి చెందిన మామిడి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు శ్రావణ్ కుమార్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో తోట పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో అడవి జంతువులను పట్టుకునేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల ఉచ్చులో చిక్కుకున్నాడు.

విద్యుత్ తీగలు తగిలి తీవ్ర షాక్‌కు గురైన శ్రావణ్ కుమార్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై మృతుడి తమ్ముడు తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాకాల సీఐ చిన్న గోవిందు దర్యాప్తు ప్రారంభించారు. అడవి జంతువుల కోసం విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.