www.ntodaynews.com
ఏకగ్రీవంగా చిట్యాల మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక.
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఈ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ గురు లింగం ఒక ప్రకటనలో తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో పౌతి అరుణాదేవి , బిల్ల సత్తయ్య , షేక్ షహాజాది , సయ్యద్ ఇమ్రాన్ ఎన్నికయ్యారు. మున్సిపల్ రూల్స్ ప్రకారం కౌన్సిల్ సభ్యులందరి సమక్షంలో వీరి ఎన్నికను ఏకగ్రీవంగా ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులకు పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది అభినందనలు తెలిపారు.