BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

పేకాట స్థావరంపై పోలీసుల దాడి : నలుగురు అరెస్ట్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
09 Jul, 2026 - 09:00 PM
168 వీక్షణలు

​యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండల పరిధిలోని వెల్లంకి గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం వెల్లంకి గ్రామంలోని ఎస్.కె. జానీ మీయా ఇంటి ముందు కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు రామన్నపేట సబ్ ఇన్‌స్పెక్టర్ జి. సతీష్‌కు నమ్మదగిన సమాచారం అందింది. ​ఎస్ఐ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ఎం. వెంకటేశ్వర్లు, నరసింహ, రాఘవేందర్, కృష్ణమూర్తిలతో కూడిన బృందం బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో సదరు ప్రాంతంపై అకస్మాత్తుగా దాడి చేశారు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు.. ​అరెస్ట్ అయిన వారిని వెల్లంకి గ్రామానికి చెందిన గోదుమల సంగప్ప, కొయ్యలకారి రాజు, కొయ్యలకారి రాము, ఎస్.కె. జానీ మీయాగా గుర్తించారు. వారి వద్ద నుండి రూ. 1,800 నగదుతో పాటు రెండు సెట్ల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ జి. సతీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.