BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రూ.10తో మీసేవలోనే యూరియా బుకింగ్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 08:02 AM
78 వీక్షణలు

తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ శుభవార్త తెలిపింది. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా లేదా ఫర్టిలైజర్ యాప్ వినియోగించలేకపోయినా ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియాను సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

కేవలం రూ.10 సేవా రుసుము చెల్లించి రైతులు సమీప మీసేవ కేంద్రంలో యూరియా బుకింగ్ చేసుకోవచ్చు.

బుకింగ్‌కు అవసరమైన వివరాలు:

పట్టాదార్ పాస్‌బుక్ నంబర్

ప్రస్తుత సాగు విస్తీర్ణం

సాగు చేస్తున్న పంట వివరాలు

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్

మీసేవ ఆపరేటర్ వివరాలను నమోదు చేసిన అనంతరం రైతు మొబైల్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని ధృవీకరించగానే బుకింగ్ పూర్తై ప్రత్యేక బుకింగ్ ఐడీ జారీ అవుతుంది.

48 గంటల్లో యూరియా తీసుకోవాలి

బుకింగ్ చేసిన తేదీని మినహాయించి, ఆ తర్వాత 48 గంటల వరకు మాత్రమే బుకింగ్ ఐడీ చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోగా రైతులు తమకు కేటాయించిన డీలర్ లేదా సహకార సంఘం వద్ద బుకింగ్ ఐడీ చూపించి యూరియా తీసుకోవాలి. గడువు ముగిస్తే బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.

సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.