BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రూ.10తో మీసేవలోనే యూరియా బుకింగ్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 08:02 AM
17 వీక్షణలు

తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ శుభవార్త తెలిపింది. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా లేదా ఫర్టిలైజర్ యాప్ వినియోగించలేకపోయినా ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియాను సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

కేవలం రూ.10 సేవా రుసుము చెల్లించి రైతులు సమీప మీసేవ కేంద్రంలో యూరియా బుకింగ్ చేసుకోవచ్చు.

బుకింగ్‌కు అవసరమైన వివరాలు:

పట్టాదార్ పాస్‌బుక్ నంబర్

ప్రస్తుత సాగు విస్తీర్ణం

సాగు చేస్తున్న పంట వివరాలు

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్

మీసేవ ఆపరేటర్ వివరాలను నమోదు చేసిన అనంతరం రైతు మొబైల్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని ధృవీకరించగానే బుకింగ్ పూర్తై ప్రత్యేక బుకింగ్ ఐడీ జారీ అవుతుంది.

48 గంటల్లో యూరియా తీసుకోవాలి

బుకింగ్ చేసిన తేదీని మినహాయించి, ఆ తర్వాత 48 గంటల వరకు మాత్రమే బుకింగ్ ఐడీ చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోగా రైతులు తమకు కేటాయించిన డీలర్ లేదా సహకార సంఘం వద్ద బుకింగ్ ఐడీ చూపించి యూరియా తీసుకోవాలి. గడువు ముగిస్తే బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.

సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.