చిట్యాల బాల నరసింహ స్వామి ఆలయంలో చోరీ
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. గుర్తుతెలియని దుండగులు ఆలయ ప్రాంగణంలోకి చొరబడి హుండీలను పగులగొట్టి నగదుతో పాటు దేవుని వస్త్రాలు, ఇతర విలువైన పూజా సామాగ్రిని అపహరించుకుపోయారు. ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి దొంగలు ఆలయంలో ప్రవేశించి ఆలయం లోని వస్తువులను అపహరించుకు పొయ్యారు అని . బుధవారం ఉదయం ఆలయ నిర్వాహకులు ఆలయానికి వచ్చేసరికి హుండీలు ధ్వంసమై ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. హుండీల్లోని నగదు తో పాటు స్వామివారి వస్త్రాలు, ఆలయ సామాగ్రి కూడా కనిపించకుండా పోవడంతో స్థానిక చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.