BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

చింతలపూడిలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 08:28 PM
76 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు ముఖ్య అతిథిగా హాజరై ఫైర్ స్టేషన్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ జన్మదిన కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా కంభం విజయరాజు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉండి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జగ్గవరపు జానకి రెడ్డి, నీరజా సుధాకర్, కొప్పుల నాగేశ్వరరావు, బొడ్డు వెంకటేశ్వరరావు, మిరియాల దిలీప్, కాటూరి ఏలియా, సొంగ సందీప్, దుర్గారావు, ఆతుకూరి సుబ్బారావు, కృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.