www.ntodaynews.com
పుంగనూరు కోనేటిపాళ్యం వద్ద ఆటో స్టాండ్ ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా
పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్ ను రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైశ్రీరామ్ ఆటో యూనియన్ కు ఎల్లప్పుడూ తన సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు.అలాగే ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నడపకూడదని ఆయన ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటరమణ రెడ్డి, మున్నా, ఆటో యూనియన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.