www.ntodaynews.com
మహబూబ్నగర్లో ఏసీబీ వలలో సూపరింటెండెంట్
తెలంగాణ
/
మహబూబ్ నగర్
మహబూబ్నగర్లోని అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే మరియు భూ రికార్డుల) కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న బొమ్మిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు.
ఫిర్యాదుదారుడి పని చేసేందుకు రూ.15,000 లంచం డిమాండ్ చేసి, ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.