www.ntodaynews.com
అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి.. పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మదనపల్లి | NTODAY NEWS
అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు (46) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణం పట్ల జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాల నిర్వహణ కోసం పోలీసు శాఖ తరఫున రూ.1 లక్ష నగదు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
రాయచోటి మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో పోలీసు అధికారులు, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో గండి వెంకటేశ్వర్లుకు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ఏఆర్ పోలీసులు గాల్లోకి గౌరవ వందన కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.