BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి.. పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Jul, 2026 - 10:26 PM
67 వీక్షణలు

మదనపల్లి | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు (46) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణం పట్ల జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాల నిర్వహణ కోసం పోలీసు శాఖ తరఫున రూ.1 లక్ష నగదు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

రాయచోటి మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో పోలీసు అధికారులు, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో గండి వెంకటేశ్వర్లుకు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ఏఆర్ పోలీసులు గాల్లోకి గౌరవ వందన కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.