BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ఆర్యవైశ్య సంఘం నాయకులతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆత్మీయ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 08:02 AM
14 వీక్షణలు

పల్నాడు జిల్లాకు చెందిన ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన చర్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. నాయకుల విజ్ఞాపనలను శ్రద్ధగా విన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అత్తులూరి సుబ్బారావు (పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు), కంభంపాటి అనిల్ (జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు), పాండురంగ శ్రీను (జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు), ఏవి గుప్తా (గురజాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు), కనమర్లపూడి రమేష్ (చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్), భవనాశ్రీ కిషోర్ (రాజుపాలెం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్), ఎస్‌పి‌ఆర్ కృష్ణ (కారంపూడి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు), చౌట శ్రీనివాసరావు (టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి), టీవీఎస్ సురేష్, రమేష్ (పిడుగురాళ్ల), సీహెచ్ నరసింహారావు (మాచవరం), లఘువరపు శివ పార్వతి సాంబశివరావు (పిల్లుట్ల)తో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.