www.ntodaynews.com
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10% పెంపు
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో సంక్షేమ శాఖల మంత్రులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంతో ప్రస్తుతం అమలులో ఉన్న మెస్ ఛార్జీలను 10 శాతం పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
పెరిగిన మెస్ ఛార్జీలతో హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు.