www.ntodaynews.com
చనుబండలో మార్క్ఫెడ్, ఇఫ్కో అధికారుల తనిఖీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని మార్క్ఫెడ్ డీఎం గుప్తా, ఇఫ్కో మేనేజర్ దిలీప్ సందర్శించారు.
ఈ సందర్భంగా సంఘం సీఈఓ వెంకటేశ్వరరావు, చైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావును కలిసి రసాయన ఎరువుల నిల్వలు, పంపిణీ విధానం, రైతులకు అందుతున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అధికారులు మాట్లాడుతూ, రైతులకు అవసరమైన రసాయన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా పంపిణీ చేపట్టాలని సూచించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంఘం అధికారులకు తెలిపారు.