BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ఉప్పలపాడులో రేషన్ షాపుపై విజిలెన్స్ తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 07:20 AM
22 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

కామవరపుకోట మండలం ఉప్పలపాడులోని ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణంలోని రికార్డులను పరిశీలించి, బియ్యం తదితర నిత్యావసర సరుకుల నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు.

అంత్యోదయ కార్డుదారులు, వృద్ధులు, వికలాంగులు తదితర లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసే సరుకులను కూడా పరిశీలించారు.

లబ్ధిదారులైన వృద్ధులు, వికలాంగులను ఫోన్ ద్వారా సంప్రదించి రేషన్ పంపిణీ విధానం, సరుకుల నాణ్యత, పరిమాణం, డీలర్ సేవా విధానంపై ఆరా తీశారు. అలాగే రేషన్ దుకాణానికి వచ్చిన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వం భారీ వ్యయంతో అమలు చేస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రతి లబ్ధిదారుడు సక్రమంగా వినియోగించుకోవాలని, రేషన్ సరుకుల అక్రమ రవాణా లేదా అక్రమ వాణిజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ హితవు పలికారు.