BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఉప్పలపాడులో రేషన్ షాపుపై విజిలెన్స్ తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 07:20 AM
75 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

కామవరపుకోట మండలం ఉప్పలపాడులోని ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణంలోని రికార్డులను పరిశీలించి, బియ్యం తదితర నిత్యావసర సరుకుల నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు.

అంత్యోదయ కార్డుదారులు, వృద్ధులు, వికలాంగులు తదితర లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసే సరుకులను కూడా పరిశీలించారు.

లబ్ధిదారులైన వృద్ధులు, వికలాంగులను ఫోన్ ద్వారా సంప్రదించి రేషన్ పంపిణీ విధానం, సరుకుల నాణ్యత, పరిమాణం, డీలర్ సేవా విధానంపై ఆరా తీశారు. అలాగే రేషన్ దుకాణానికి వచ్చిన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వం భారీ వ్యయంతో అమలు చేస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రతి లబ్ధిదారుడు సక్రమంగా వినియోగించుకోవాలని, రేషన్ సరుకుల అక్రమ రవాణా లేదా అక్రమ వాణిజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ హితవు పలికారు.