www.ntodaynews.com
మంత్రి కొలుసు పార్థసారధి సహకారంతో బాధితుడికి రూ.3.52 లక్షల ఎల్ఓసీ మంజూరు లేఖ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామానికి చెందిన గోకవరపు వెంకటేశ్వరరావు (మరణించిన) కుమారుడు గోకవరపు రాకేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుడిచేతి కాలర్ బోన్ విరిగింది.
మెరుగైన వైద్యం అందించేందుకు రూ.3,52,000 విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు కోసం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సహకారంతో గురువారం ఎల్ఓసీ మంజూరు లేఖను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, గోకవరపు హరీష్ పాల్గొన్నారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.