BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఏపీలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు.. ప్రజలకు మరింత సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 12:51 PM
117 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత చేరువ చేసేందుకు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మహారాష్ట్రలో అమలవుతున్న తరహాలో రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుంది.

ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంతో పాటు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యం. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన ఎక్కువ భాగం సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురానున్నారు.

సేవా కేంద్రాల్లో అందే సేవలు:

ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రాథమిక సేవలు

అమ్మకపు ఒప్పందాల పరిశీలన

అవసరమైన పత్రాల తనిఖీ

డాక్యుమెంట్ల స్కానింగ్, అప్‌లోడ్

అపాయింట్‌మెంట్ బుకింగ్

ఈ-కేవైసీ

స్టాంప్ డ్యూటీ లెక్కింపు

రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు

మార్కెట్ విలువ సమాచారం

ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)

సర్టిఫైడ్ కాపీలు

దరఖాస్తు స్థితి తదితర సేవలు

అయితే తుది రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు ముందు జరిగే అన్ని ప్రక్రియలను సేవా కేంద్రాల్లో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ విధానం అమలైతే గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, వృద్ధులు, మహిళలు, అలాగే భూములు, ఇళ్లు కొనుగోలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం, పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.