BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

భగవానుపురంలో గోమాత ఫోటోల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 01:36 PM
233 వీక్షణలు

గంపలగూడెం మండలంలో ఇప్పటివరకు 170 గోమాత ఫోటోలు పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు శివారు గ్రామమైన భగవానుపురంలో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మంలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. గోవును పూజించడం అంటే సకల దేవతలను పూజించినట్లేనని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గోవును పూజించే అవకాశం లేని వారు గోమాత ఫోటోను ఇంట్లో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజించవచ్చని తెలిపారు.

అనంతరం పెనుగొలను శిరిడి సాయిబాబా మందిరంలో కూడా భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు. గంపలగూడెం మండలానికి చెందిన దాత కుందా కోటేశ్వరరావు అందజేసిన 170 గోమాత ఫోటోలను మండలంలోని వివిధ గ్రామాల భక్తులకు ఇప్పటికే పంపిణీ చేసినట్లు శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు వెల్లడించారు.