BREAKING
ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి..
www.ntodaynews.com

భగవానుపురంలో గోమాత ఫోటోల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 01:36 PM
48 వీక్షణలు

గంపలగూడెం మండలంలో ఇప్పటివరకు 170 గోమాత ఫోటోలు పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు శివారు గ్రామమైన భగవానుపురంలో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మంలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. గోవును పూజించడం అంటే సకల దేవతలను పూజించినట్లేనని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గోవును పూజించే అవకాశం లేని వారు గోమాత ఫోటోను ఇంట్లో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజించవచ్చని తెలిపారు.

అనంతరం పెనుగొలను శిరిడి సాయిబాబా మందిరంలో కూడా భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు. గంపలగూడెం మండలానికి చెందిన దాత కుందా కోటేశ్వరరావు అందజేసిన 170 గోమాత ఫోటోలను మండలంలోని వివిధ గ్రామాల భక్తులకు ఇప్పటికే పంపిణీ చేసినట్లు శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు వెల్లడించారు.