BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

కోతులు, కుక్కల బెడద నివారించాలి అని బిఆర్‌ఎస్ వినతి పత్రం అందజేత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
09 Jul, 2026 - 09:01 PM
103 వీక్షణలు

చిట్యాల పట్టణంలో రోజురోజుకూ మితిమీరిపోతున్న కోతులు, వీధి కుక్కల బెడదను తక్షణమే నివారించాలని కోరుతూ చిట్యాల మున్సిపల్ కమిషనర్‌కు బిఆర్‌ఎస్  పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు గురువారం  వినతిపత్రాన్ని సమర్పించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణంలో కోతులు ఇళ్లలోకి, దుకాణాల్లోకి చొరబడి ఆహార పదార్థాలను ధ్వంసం చేయడమే కాకుండా, ప్రజలపై దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ​మరోవైపు వీధి కుక్కల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయిందని, రాత్రి వేళల్లో ప్రజలను వెంటాడటం, కుక్క కాట్ల ప్రమాదాలు పెరగడం వల్ల ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం ప్రమాదంలో పడ్డాయని వారు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు . ​కోతుల బెడద నివారణ: సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని కోతుల బెడదను అరికట్టడానికి తక్షణ చర్యలు చేపట్టాలి అని,  వీధి కుక్కల జనాభా నియంత్రణ (స్టెరిలైజేషన్), టీకాలు మరియు ఇతర అవసరమైన చర్యలను వేగవంతం తీసుకోవాలన్నారు  ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.

​ఈ సమస్యలను త్వరగా పరిష్కరించని యెడల బిఆర్‌ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో వైస్ చైర్మన్ మండే సైదులు, మాజీ మున్సిపల్ చైర్మన్  కూరెళ్ళ లింగస్వామి మాజీ కౌన్సిలర్  జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బిల శివశంకర్ రెడ్డి,2 వార్డ్ కౌన్సిలర్ షబానా అజీముద్దీన్ మరియు BRS పార్టీ 9 వార్డు ఇన్చార్జ్ ఆగు అశోక్ యాదవ్, బోలుగూరి సైదులు,  ఉప్పలపల్లి సైదులు, తోటకూరీ అనీల్, కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు