మా భూమి రికార్డులలో అతని పేరు మార్చుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడు..
అన్నమయ్య జిల్లా..పుంగనూరు
పేదల భూమి పై కన్నేసిన కబ్జా దారుడు..
చౌడేపల్లి మండలం కాగితీ గ్రామ పంచాయతీ కి చెందిన బాబు సాహెబ్ పేద కుటుంబం పంచర్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం వారు బాబు సాహెబ్ పేరు మీద యాబై సంవత్సరాలు క్రితం దిగువపల్లె రెవిన్యూ 469/2 ఏ సర్వే నెంబర్ లో 3.34 సెంట్లు 466 లో 2ఎకరాల 35సెంట్లు భూమిని గత 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు మంజూరు చేశారని,అలాగే అతని భార్య షేక్ హసీనా పేరు మీద 183/19, లో ఎకరా భూమిని ఇచ్చారని తన కుమార్తె వివాహ ఖర్చుల నిమిత్తం 3 లక్షల రూపాయలు కృష్ణప్ప కు అడుమానం పెట్టగా కృష్ణప్ప కు తిరిగి డబ్బు ను వాపసు ఇచ్చిన తీసుకోకుండా కాలయాపన చేసి డిసెంబర్ నెల 2023 లో మా భూమి కి సంబందించిన వన్ బి తనపై మార్చుకుని ఇప్పుడు భూమి పూర్తిగా మాదే అంటూ తమ పై తిరగబడుతున్నాడని, తమ భూమిని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టామని ఐతే ఇదే విషయంపై మదనపల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని,మా భూమికి సంబంధించి డాక్యుమెంట్లు తన పేరు మార్చుకొన్నాడని ఎమ్మార్వోకి విఆర్ఓకి పిర్యాదు చేసిన మాకు న్యాయం జరగడం లేదని,నిన్న తమ భూమిలో అక్రమంగా మొక్కలు నాటుతుండగా అడగడానికి వెళ్లిన తమ కుటుంబ సభ్యులపై దాడి చేసారాని,దీనిపై అధికారులు,కూటమి ప్రభుత్వం స్పందించి పేదలైన మాకు మా భూమిని తిరిగి ఇప్పించాలని కోరుకుంటున్నామన్నారు.