ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు అందజేత
ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు అందజేత
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ అనారోగ్య కారణాల వలన 02.04.2026 వ తేదీన చనిపోయిన వంగాల మాధవరెడ్డి భార్య సుజాతకు ఈరోజు 27.04.2026 నాడు ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల జిల్లా ఎస్పీ ఛాంబర్లో ఫ్లాగ్ ఫండ్ ద్వారా 25,000 రూపాయలు చెక్కును మరియు విడో ఫండ్ ద్వారా 50,000 రూపాయలు చెక్కులను అందజేశారు. జిల్లా ఎస్పీ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘దివంగత మాధవరెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్కు ఎనలేని సేవలు అందించారని, వారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేనని, వారి మరణం పోలీస్ డిపార్ట్మెంట్కు తీరని లోటని,వారికి ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలను త్వరగా అందించడానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే వారి కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి కారుణ్య నియమకానికి సిఫారసులు చేస్తానని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు, పోలీస్ ప్రధాన కార్యాలయం బి సెక్షన్ సూపరింటెండెంట్ పి. నాగేశ్వర రావు మరియు పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.