BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

ప్రసవించిన అరగంటలోపే ముర్రుపాలు తప్పనిసరి – డా. శ్రీగిరీష

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 05:13 AM
15 వీక్షణలు

పీలేరు మండలం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

ప్రసవించిన అరగంటలోపే నవజాత శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ముర్రుపాలు శిశువుకు తొలి రక్షణ కవచంగా పనిచేస్తాయని, రోగనిరోధక శక్తిని పెంచి అనేక అంటువ్యాధుల నుంచి కాపాడుతాయని వివరించారు.

జననం నుంచి తొలి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే సంపూర్ణ పౌష్టికాహారమని పేర్కొన్నారు. తల్లిపాలు శిశువు శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధి, మానసిక వికాసానికి కూడా ఎంతో దోహదపడతాయని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గర్భిణి, బాలింతకు ముర్రుపాల ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రతి శిశువుకు జీవితంలోనే ఉత్తమ ఆరంభాన్ని అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.