www.ntodaynews.com
వర్షాకాలంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి రైతులకు అత్యవసర హెచ్చరిక
జాతీయం
వర్షాకాలం వచ్చిందంటే చాలు… పొలాల్లోనే కాదు, బోరు బావులు, మోటార్ విద్యుత్ షట్టర్ బాక్సులు, పంపుసెట్లు, ఇతర విద్యుత్ పరికరాల వద్ద కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు, నిపుణులు రైతులకు గట్టిగా సూచిస్తున్నారు.
వర్షాల ప్రభావంతో పాములు తమ బొరియల నుంచి బయటకు వచ్చి పొడి, వెచ్చని ప్రదేశాల్లో ఆశ్రయం కోసం తిరుగుతాయి. ఈ క్రమంలో బోరు బావి షట్టర్ బాక్సులు, మోటార్ గదులు, విద్యుత్ ప్యానెల్ బాక్సులు వాటికి సురక్షిత దాక్కునే చోట్లుగా మారే ప్రమాదం ఉంది.
అందుకే రైతులు షట్టర్ బాక్సు లేదా మోటార్ బాక్సును తెరిచే ముందు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నేరుగా చేతులు పెట్టకుండా, ముందుగా పొడవాటి కర్రతో తట్టి లేదా సురక్షిత దూరం నుంచి జాగ్రత్తగా తెరిచి లోపల పరిస్థితిని పరిశీలించిన తర్వాతే పనులు ప్రారంభించాలి.
చిన్న అలసత్వం కూడా ప్రాణాంతక పాముకాటుకు దారితీసే అవకాశం ఉన్నందున, రైతులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించి తమ ప్రాణాలను తామే కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తు