www.ntodaynews.com
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి.. కృష్ణమ్మ పరవళ్లు
తెలంగాణ
తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేయడంతో కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల గేట్ల నుంచి భారీ జలధారలు కిందకు దూసుకెళ్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాజెక్టు పరిసరాలకు చేరుకుంటున్నారు. మరోవైపు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అవసరం లేకుండా నది వద్దకు వెళ్లొద్దని సూచించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు చేపడుతున్నారు.