www.ntodaynews.com
ఏలూరు జిల్లాలో బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లాలో బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీడబ్ల్యూజేఎఫ్ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APBJA) ఏలూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నికలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం భవనంలో జరిగింది.
ఈ ఎన్నికల్లో పెంట నారాయణను అధ్యక్షుడిగా, ఎం. కిరణ్ను కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పి. సుమన్, డి. సత్యనారాయణలను ఎంపిక చేయగా, డోలా దాసును కోశాధికారిగా నియమించారు. భాషను సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
ఇదే కాకుండా, మరో తొమ్మిది మంది సభ్యులతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వం సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది.
ఈ వార్త కూడా చదవండి