BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 02 June 2026, 05:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:41 AM
200 వీక్షణలు

ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమడు గ్రామ శివారులోని జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది.

మృతులను తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన వడ్డే వెంకటలక్ష్మి (తల్లి), వరలక్ష్మి (కూతురు)గా గుర్తించారు.

దూబచర్ల-చేబ్రోలు రహదారి పక్కన ఉన్న జీడిమామిడి తోటలో రెండు మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలంలో ఒక మహిళ తలకు బలమైన గాయం ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. అలాగే మహిళలకు చెందిన హ్యాండ్‌బ్యాగ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే చేబ్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే అన్ని కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.