BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా విద్యుత్ కమిటీ సమావేశం.. పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 07:46 PM
25 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా విద్యుత్ కమిటీ (డీఈసీ) సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఇతర శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో పునరుద్ధరించిన విద్యుత్ పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) అమలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ, విద్యుత్ సేవల నాణ్యత మెరుగుదల, మౌలిక సదుపాయాల బలోపేతం, విద్యుత్ నష్టాల తగ్గింపు, వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

అలాగే జిల్లాలో విద్యుత్ రంగ అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. జిల్లా అభివృద్ధికి అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చర్చకు వచ్చాయి.