BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా విద్యుత్ కమిటీ సమావేశం.. పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 07:46 PM
93 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా విద్యుత్ కమిటీ (డీఈసీ) సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఇతర శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో పునరుద్ధరించిన విద్యుత్ పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) అమలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ, విద్యుత్ సేవల నాణ్యత మెరుగుదల, మౌలిక సదుపాయాల బలోపేతం, విద్యుత్ నష్టాల తగ్గింపు, వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

అలాగే జిల్లాలో విద్యుత్ రంగ అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. జిల్లా అభివృద్ధికి అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చర్చకు వచ్చాయి.