ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి
ఏలూరు-జంగారెడ్డి గూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి
చింతలపూడి శాసన సభ్యుడు సొంగా రోషన్ కుమార్ ఆదేశాలతో, ఆగిపోయిన ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. కామవరపుకోట వద్ద ఉన్న ఉప్పలపాడు నుండి దేవులపల్లి వరకు సుమారు 5 కిలోమీటర్ల పొడవుతో, 7 మీటర్ల వెడల్పు మరియు 100 మిల్లీమీటర్ల మందంతో ఈ రోడ్డు నిర్మాణం జరగుతోంది. నాలుగు కోట్ల రూపాయలతో ఈ పనులు జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టులో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కూడా రెండు కిలోమీటర్ల వరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు వేగంగా జరుగుతున్నందున, ప్రజల నుండి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.
ప్రస్తుతం, ఈ రోడ్డు నిర్మాణం ప్రజల ప్రయాణానికి సులభతరం చేయడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి మేలుచేస్తున్నట్లు చెబుతున్నారు.