www.ntodaynews.com
ఏలూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి...
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి మృతుడి వివరాల కోసం పోలీసుల విజ్ఞప్తి
ఏలూరు: నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆటోనగర్ సమీపంలోని మురుగు కాల్వ వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు వెల్లడించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు వివరాలు లభించాయా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రజల సహకారం కోరారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే ఏలూరు రూరల్ ఎస్ఐ 9440796636, ఏలూరు వన్టౌన్ సీఐ 9440796604 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.