ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.
ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.. ఇకపై అన్నింటికీ ‘112’ నంబర్
అమరావతి :
ఏపీ రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న 108 (ఆంబులెన్స్), 104 (ఆరోగ్య సేవలు), 102, పోలీస్, ఫైర్ వంటి సేవలను ప్రభుత్వం ఒకే ప్లాట్ఫారమ్లోకి తీసుకువస్తోంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పీఎం రావత్’ ప్రాజెక్టు ఆధారంగా, అమెరికాలో అమలులో ఉన్న 911 విధానాన్ని అనుసరించి, ఇకపై అన్ని అత్యవసర సేవలు ‘112’ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే, ప్రమాదాలు, వైద్య అత్యవసరాలు, అగ్ని ప్రమాదాలు, భద్రత సమస్యలు వంటి అన్ని సందర్భాల్లో ఒకే నంబర్కు కాల్ చేస్తే సరిపోతుంది.
దీంతో సేవల సమన్వయం మెరుగుపడి, స్పందన సమయం తగ్గి, ప్రజలకు వేగవంతమైన సహాయం అందే అవకాశం ఉంది.