BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఏపీ ప్రజలకు అలర్ట్ జనన, మరణాల నమోదులో కొత్త నిబంధనలు అమలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:18 AM
190 వీక్షణలు

అమరావతి, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనన, మరణాల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 1999 నిబంధనలను రద్దు చేసి, కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 17, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కొత్త నియమాల ప్రకారం పుట్టిన లేదా మరణించిన 21 రోజులలోపు నమోదు చేసుకుంటే ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా నమోదు చేయవచ్చు. అయితే 30 రోజుల తర్వాత నమోదు చేసుకుంటే రూ.250 జరిమానా విధించనున్నారు. ఒక సంవత్సరం దాటిన తర్వాత నమోదు చేయాలంటే రూ.500 ఫీజుతో పాటు మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు.

జనన సర్టిఫికెట్‌లో పేరు నమోదు చేయని పక్షంలో, 12 నెలల లోపు ఉచితంగా పేరు చేర్చుకునే అవకాశం కల్పించారు. ఆ గడువు దాటితే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

దత్తత పిల్లల నమోదు కోసం ప్రత్యేకంగా ‘ఫారమ్ 1-ఏ’ను ప్రవేశపెట్టారు. అలాగే ఇకపై జనన, మరణాల నమోదును పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. డిజిటల్ సర్టిఫికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

ప్రజలు ఈ కొత్త నిబంధనలను గమనించి, సమయానికి నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.