BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

ఏపీ ప్రజలకు అలర్ట్ జనన, మరణాల నమోదులో కొత్త నిబంధనలు అమలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:18 AM
122 వీక్షణలు

అమరావతి, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనన, మరణాల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 1999 నిబంధనలను రద్దు చేసి, కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 17, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కొత్త నియమాల ప్రకారం పుట్టిన లేదా మరణించిన 21 రోజులలోపు నమోదు చేసుకుంటే ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా నమోదు చేయవచ్చు. అయితే 30 రోజుల తర్వాత నమోదు చేసుకుంటే రూ.250 జరిమానా విధించనున్నారు. ఒక సంవత్సరం దాటిన తర్వాత నమోదు చేయాలంటే రూ.500 ఫీజుతో పాటు మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు.

జనన సర్టిఫికెట్‌లో పేరు నమోదు చేయని పక్షంలో, 12 నెలల లోపు ఉచితంగా పేరు చేర్చుకునే అవకాశం కల్పించారు. ఆ గడువు దాటితే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

దత్తత పిల్లల నమోదు కోసం ప్రత్యేకంగా ‘ఫారమ్ 1-ఏ’ను ప్రవేశపెట్టారు. అలాగే ఇకపై జనన, మరణాల నమోదును పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. డిజిటల్ సర్టిఫికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

ప్రజలు ఈ కొత్త నిబంధనలను గమనించి, సమయానికి నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.