BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 18 March 2026, 12:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ ప్రజలకు అలర్ట్ జనన, మరణాల నమోదులో కొత్త నిబంధనలు అమలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:18 AM
223 వీక్షణలు

అమరావతి, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనన, మరణాల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 1999 నిబంధనలను రద్దు చేసి, కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 17, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కొత్త నియమాల ప్రకారం పుట్టిన లేదా మరణించిన 21 రోజులలోపు నమోదు చేసుకుంటే ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా నమోదు చేయవచ్చు. అయితే 30 రోజుల తర్వాత నమోదు చేసుకుంటే రూ.250 జరిమానా విధించనున్నారు. ఒక సంవత్సరం దాటిన తర్వాత నమోదు చేయాలంటే రూ.500 ఫీజుతో పాటు మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు.

జనన సర్టిఫికెట్‌లో పేరు నమోదు చేయని పక్షంలో, 12 నెలల లోపు ఉచితంగా పేరు చేర్చుకునే అవకాశం కల్పించారు. ఆ గడువు దాటితే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

దత్తత పిల్లల నమోదు కోసం ప్రత్యేకంగా ‘ఫారమ్ 1-ఏ’ను ప్రవేశపెట్టారు. అలాగే ఇకపై జనన, మరణాల నమోదును పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. డిజిటల్ సర్టిఫికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

ప్రజలు ఈ కొత్త నిబంధనలను గమనించి, సమయానికి నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.