BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

ఏపీ ప్రజలకు శుభవార్త.. వాట్సాప్ ద్వారానే ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసే అవకాశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 03:16 PM
18 వీక్షణలు

అమరావతి:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే "మన మిత్ర" వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు పౌర సేవలను అందిస్తున్న ప్రభుత్వం, త్వరలో ప్రజల ఫిర్యాదులను కూడా వాట్సాప్ ద్వారానే స్వీకరించే విధానాన్ని తీసుకురానుంది.

ఈ కొత్త విధానంలో ప్రజలు తమ సమస్యలను టెక్స్ట్‌తో పాటు వాయిస్ మెసేజ్ రూపంలో కూడా పంపించే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ప్రతి సోమవారం జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌కు ప్రత్యామ్నాయంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ వ్యవస్థను వీలైనంత త్వరగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

ఈ సదుపాయం అమల్లోకి వస్తే ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో పాటు సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం కానుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం తుది ఏర్పాట్లు చేస్తోంది.