www.ntodaynews.com
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ
జాతీయం
ముంబై: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లో పులుల సంఖ్య పెంపు, జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా రెండు ఆడపులులను అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంపై పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో వన్యప్రాణి సంరక్షణకు మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.