www.ntodaynews.com
ప్రజల ప్రేమకు ముగ్ధుడైన ఎస్సై సాగర్.. సీఐగా పదోన్నతి పొందాలని ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
అనంతపురం జిల్లా నార్పల మండలంలో ప్రజలతో మమేకమై సేవలందిస్తున్న ఎస్సై సాగర్పై ప్రజలు, భక్తులు చూపిస్తున్న అభిమానానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, భక్తులు తరలివచ్చి త్వరలోనే సీఐగా పదోన్నతి పొందాలని ఆకాంక్షించారు.
ఎస్సై సాగర్ పట్ల ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపగా, ఫోటోల కోసం భక్తులు పోటీ పడిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రజల నుంచి లభిస్తున్న ఈ అపారమైన ఆదరణ తనపై మరింత బాధ్యతను పెంచిందని ఎస్సై సాగర్ తెలిపారు. ప్రజల ప్రేమ, విశ్వాసమే తనకు గొప్ప బహుమతిగా భావిస్తున్నానని, ఈ అభిమానాన్ని నార్పల మండల ప్రజలందరికీ అంకితం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.