BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

Madanapalle: ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.. సత్వర న్యాయమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jun, 2026 - 07:54 AM
66 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు అందజేసే ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

అర్జీల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులను ఆదేశించిన ఆయన, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల నుంచి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు.

ప్రజలు జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లలోనే నిర్భయంగా ఫిర్యాదులు సమర్పించవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. స్థానికంగా అందే ఫిర్యాదులను కూడా క్షుణ్ణంగా విచారించి, చట్టపరంగా త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.