West Godavari: ఉత్తమ పారిశ్రామికవేత్తగా గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు) ఎంపిక
పశ్చిమ గోదావరి | NTODAY NEWS
సీనియర్ నాయకుడు, ప్రజాప్రతినిధి, అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్, జిల్లా పరిశ్రమల అధికారి తదితరులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయడంలో పెదబాబు చేసిన సేవలు ఆదర్శనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు గుత్తా సాయి సత్య వరప్రసాద్కు శుభాకాంక్షలు తెలియజేశారు.