www.ntodaynews.com
పల్స్ పోలియో సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
విదేశీ పర్యటన ముగించుకుని చింతలపూడి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ను అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ) వైద్యాధికారిణి డాక్టర్ ఎస్కే అఫ్రిన్, యూపీహెచ్సీ చైర్మన్ సొంగా యేసుపాదం, వైద్య సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం ఇంటింటి పల్స్ పోలియో సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రతి కుటుంబం బాధ్యతగా సహకరించాలని కోరారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.